4 నెలలుగా పుట్టింట్లోనే భార్య.. కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన వ్యక్తి అత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పూసపాటిరేగకు చెందిన గుమ్మడి రాంబాబు (32)కు అదే గ్రామానికి చెందిన నందినికి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు వేణు(7), నవీన్ (5)ఉన్నారు. భర్త తరుచూ వేధిస్తుండటంతో నందిని పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగు నెలలుగా కాపురానికి రాకపోవడంతో రాంబాబు ఆమెను ఎన్నోసార్లు బ్రతిమాలాడు. అయినా వినిపించుకోకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. Also Read: భర్త వేధింపులు భరించలేకపోతున్నానని, తాను అతడితో కాపురం చేయలేనని నందిని అందరి ముందు తెగేసి చెప్పింది. అయినప్పటికీ ఆశ కోల్పోయిన రాంబాబు సోమవారం అత్తింటికి వెళ్లి భార్యను రమ్మని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఇంటికి వెళ్లి అదే రోజు రాత్రి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం అతడిని గమనించిన స్థానికులు పూసపాటిరేగ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ బాలాజీరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు. Also Read:
By August 19, 2020 at 08:39AM
No comments