Breaking News

రిసార్ట్‌లో ఘోరం.. మైనర్ బాలికపై 30 మంది సామూహిక అత్యాచారం


ఇజ్రాయెల్‌ దేశంలో దారుణ సంఘటన జరిగింది. 16ఏళ్ల బాలికపై 30 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. ఈలాత్ నగరానికి చెందిన బాలిక ఇటీవల రెడ్‌ సీ రిసార్ట్ చూడటానికి స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ ఒంటరిగా తిరుగుతున్న బాలికపై కొందరు కామాంధుల కన్ను పడింది. మాయమాటలతో ఆమెను రిసార్ట్‌లోని ఓ గదికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను బంధించిన ఆ కామాంధులు ఏకంగా 30 మంది వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: మరుసటి రోజు ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో దేశవ్యా్ప్తంగా ఆందోళన మొదలైంది. రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్న ప్రజలు దోషులను కఠినంగా శిక్షించగాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. Also Read: మహిళలపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలకు చరమగీతం పాడాలంటూ తెల్ అవివ్‌, జెరూస‌లేం న‌గ‌రాల్లో వేలాది ప్రజలు రోడ్లపై నిరసనలు చేపడుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని బెంబమిన్ నెతన్యాహు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందని, స్పందించేందుకు మాటలు కూడా రావడం లేదన్నారు. ఇది ఓ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం మాత్రమే కాదని, మానవత్వానికి మాయని మచ్చలాంటి ఘటన అని అన్నారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. Also Read:


By August 23, 2020 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/16-yr-old-girl-gang-raped-by-30-men-in-red-sea-resort-in-israel/articleshow/77699474.cms

No comments