Breaking News

లాక్‌డౌన్‌తో ఆర్థిక కష్టాలు.. భార్యను చంపి ఉరేసుకున్న భర్త


క్షణికావేశం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. భార్య తిట్టిందన్న ఆగ్రహంతో క్షణికావేశానికి గురైన ఓ వ్యక్తి ఆమెను సుత్తితో కొట్టి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా గూడువాంజేరి పట్టణం సమీపంలోని వల్లన్‌చ్చేరి గ్రామానికి చెందిన స్టీఫెన్‌‌సన్‌ (52) స్థానికంగా బార్ అండ్ రెస్టారెంట్‌లో పార్సిల్‌ సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మూడో భార్య ఉమ(38)తో కలిసి వల్లన్‌చ్చేరిలో నివాసం ఉంటున్నాడు. Also Read: లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. తినడానికి తిండి కూడా లేకపోవడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం భార్యభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్టీఫెన్‌‌సన్‌ సుత్తితో ఉమ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. క్షణికావేశంలో భార్యను చంపేశానని మనస్తాపం చెందిన స్టీఫెన్ తొలి భార్య కుమార్తె దివ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను కూడా చనిపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. Also Read: దీంతో ఆందోళనకు గురైన దివ్య వల్లన్‌చ్చేరిలో ఉంటున్న బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు వెళ్లి చూసేసరికే ఉమ రక్తపు మడుగులో పడి ఉండగా, స్టీఫెన్ ఉరేసుకుని కనిపించాడు. దీంతో వారు గూడువాంజేరి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. Also Read:


By April 28, 2020 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-before-his-commits-suicide-in-tamil-nadu/articleshow/75422015.cms

No comments