Breaking News

‘నువ్వైనా సుఖంగా ఉండు’.. మూడో భార్యకు మెసేజ్‌ పెట్టి యువకుడి ఆత్మహత్య


జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నల్గొండ శివరాంనగర్‌ కాలనీకి చెందిన పొట్టబత్తిని రాజశేఖర్‌(30) పానగల్‌ చెరువు ప్రాంతంలోని ఎస్‌ఎల్‌బీసీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. Also Read: నల్గొండ టూటౌన్ ఎస్ఐ నర్సింహులు కథనం ప్రకారం.. రాజశేఖర్‌కు గతంలో ఆరు నెలల క్రితం మూడో వివాహం జరిగింది. గతంలో వివాహం చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు కొద్దిరోజులకే అతడితో విడాకులు తీసుకోవడంతో ఆరు నెలల క్రితం మూడో పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతడి జీవితంలో మార్పు రాలేదు. మూడో భార్యతోనూ గొడవలు జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘నేను చనిపోతున్నా. నువ్వైనా సుఖంగా ఉండు’ అంటూ శుక్రవారం భార్య సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేసిన రాజశేఖర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By April 26, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/30-yr-old-man-commits-suicide-in-nalgonda-over-family-disputes/articleshow/75385496.cms

No comments