Breaking News

ఫేక్ వీడియో పోస్టు చేసిన గవర్నర్... ఆడేసుకుంటున్న నెటిజన్స


కరోనా వైరస్ గురించి ప్రభుత్వ, అధికారిక సమాచారం కన్నా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే ఎక్కువ. అయితే అందులో ఫేక్ న్యూస్ ఎక్కువ. అయితే ఈ ఫేక్ న్యూస్‌తో రాజకీయ నేతలు కూడా బోల్తా పడుతున్నారు. నిజమేనని నమ్మి ఆ ఫేక్ వీడియోల్ని పోస్టు చేస్తూ... నెటిజన్లతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ గవర్నర్ కూడా ఫేక్ వీడియోల్ని గుడ్డిగగా నమ్మి పోస్టు చేశారు. ఓ ఫేక్ వీడియోను గుడ్డిగా నమ్మి, దాన్ని ఫార్వార్డ్ చేసిన కిరణ్ బేడీపై నెటిజన్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో... చాలా చోట్ల చికెన్ అమ్మకాలు పడిపోయాయి. చికెన్ కారణంగా కరోనా వస్తుందన్న అనుమానంతో వృధా గా పారేసిన కోడిగుడ్లు కోడిపిల్ల లై పోయాయి.. ప్రకృతి ఎంత అద్భుతమైనదో కదా అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీన్ని నిజమేనని నమ్మేసిన మరికొందరు తమ తమ సోషల్ మీడియా ఎకౌంట్లలో షేర్ చేశారు. ఇదే కోడిపిల్లల వీడియో ఎవరి నుంచో తనకు కూడా రావడంతో... కూడా షేర్ చేశారు. ఓ చోట గుంపులుగా కోడిపిల్లలు తిరుగుతూ ఉండగా, "కోడిగుడ్డు వల్ల కరోనా వ్యాపిస్తుందన్న భయంతో మనం వాటిని పారేస్తున్నాం. అయితే, అవి ఓ వారం తరువాత ఇలా కోడిపిల్లలుగా మారతాయి. ఇదే సృష్టి స్వభావం. ప్రతి జీవితానికీ దాని సొంత మార్గం ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. దీంతో కిరణ్ బేడీ పోస్టుపై నెటిజన్లు విమర్శలు అందుకున్నారు. ప్రజలు తినే, పారేసే గుడ్లు ఎలా కోడిపిల్లలుగా మారతాయని నెటిజన్లు ఆమెను ప్రశ్నస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆమెకు, కోడి పిల్లలు ఎలా వస్తాయో కూడా తెలియదా? అని అడుగుతున్నారు. ఏదైనా పోస్ట్ చేసేముందు, షేర్ చేసేముందు సరిచేసుకునే బాధ్యత ఏమైపోయిందని మండిపడుతుతూ ఉన్నారు. ఆమె తన వాట్స్ యాప్ ను తీసేయాలని కూడా అంటున్నారు.


By April 07, 2020 at 12:58PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kiran-bedi-posts-fake-forward-on-egg-and-chicken/articleshow/75023927.cms

No comments