Breaking News

ముంబైలో ఘోరం... కరోనాతో నిండు గర్భిణి మృతి


కరోనా వైరస్‌కు అనేకమంది అమాయకులు బలవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల నుంచి మసలివాళ్ల వరకు అందర్నీ ఈ వైరస్ బలి తీసుకుంటుంది. తాజాగా కారణంగా నిండు గర్భిణి మృతిచెందింది. ఈ దుర్ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ముంబైలో నల్లసోపారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన శనివారం రాత్రి ముంబయిలోని బివైఎల్‌ నాయర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితిని చూసిన డాక్టర్లు కరోనా ఉండొచ్చని అంచనా వేశారు. దీంతో వైద్యులు ఆమెను వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. కరోనా నిర్ధారణ పరీక్ష కూడా చేశారు. అయితే అప్పటికే ఆమె ఆరోగ్య స్థితి మరింత దిగజారటంతో... కొద్ది గంటల్లోనే మృతిచెందింది. గర్భంలోని శిశువు కూడా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం వెలువడిన కొవిడ్‌-19 పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాయర్‌ ఆస్పత్రికి తీసుకురావటానికి ముందు ఆమెను చేర్చుకోవటానికి రెండు ఆస్పత్రులు తిరస్కరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మహారాష్ట్రలో కరోనా మరణాలు రేటు 53కు చేరింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 850కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మృతురాలు వయసు 38ఏళ్లు. నల్ల సపోరా ప్రాంతంలో గర్భిణి మృతితో మృతుల సంఖ్య మూడుకు చేరింది. గత ఆదివారం ఇదే ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు కరోనాతో చనిపోయాడు. శనివారమే గర్భిణి కరోనాతో మృతి చెందగా ఆమెకు సంబంధించిన రిపోర్టులు సోమవారం వచ్చాయి. దీంతో ఆమె కరోనా పాజిటివ్ లక్షణాలతోనే చనిపోయిందని డాక్టర్లు దృవీకరించారు. వెంటనే ఆమె భర్తతో పాటు చిన్నారిని ఐసోలేషన్‌కు తరలించారు. ఆమె ఇంటిని క్వారంటైన్ చేశారు.


By April 07, 2020 at 11:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pregnant-vasai-woman-dies-of-covid-19-third-case-in-region/articleshow/75022434.cms

No comments