శంషాబాద్లో రోడ్డుప్రమాదం.. డీసీఎం నుజ్జునుజ్జు.. ఒకరి దుర్మరణం


హైదరాబాద్ నగర శివారు ఎయిర్పోర్ట్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న డీసీఎం ఓవర్ స్పీడ్తో అదుపుతప్పి వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగింది. Also Read: కర్నూలు నుంచి హైదరాబాద్కు ఉల్లిపాయల లోడుతో వస్తున్న డీసీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్ పరిధిలోని తొండుపల్లి ఓఆర్ఆర్ బ్రిడ్జి వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో ముందు వెళ్తున్న వాటర్ ట్యాంక్ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో డీసీఎం ముందు భాగం నుజ్జునుజ్జయింది. క్యాబిన్లో ఉన్న ఇద్దరిలో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:
By April 27, 2020 at 10:47AM
No comments