Breaking News

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఇంట్లో ఉండలేక ఏడుగురు ఆత్మహత్యాయత్నం


ఇటీవల కాలంలో అందరూ ఆఫీసులు, వ్యాపారాలు, ఇంటి పనులంటూ బయట తిరగడం అలవాటైపోయింది. కొందరైతే ఇంట్లో ఉండలేక సినిమాలు, షాపింగ్ అంటూ తిరుగుతుంటారు. ఏదేమైనా రోజుకోసారి బయటకు వెళ్లి రాకపోతే ఏమీ తోచనివారు చాలామంది ఉంటారు. అలాంటి వారందరూ లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే కదలకుండా ఉంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉండలేక, బయట తిరగలేక డిప్రెషన్‌కు గురై ప్రాణాలు తీసుకునేందుకు సైతం వెనుకాడటం లేదు. క్రమంగా ఇదొక మానసిక సమస్యగా మారుపోతోంది. తమిళనాడులోని సేలం జిల్లాలో మంగళవారం ఐదుగురు మహిళలు సహా ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. Also Read: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్‌డౌన్‌‌ను కచ్చితంగా అమలు చేస్తోంది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటిగా ఉంది. దీంతో ప్రజలు అకారణంగా రోడ్లపైకి వస్తే అరెస్ట్‌ చేయడం, కేసులు పెట్టడం, వాహనాలను సీజ్‌ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటోంది. సేలం జిల్లా ఆత్తూరు సమీపం కాట్టుకోట్టై ప్రాంతానికి చెందిన అయ్యనార్‌మలై (50) అనే వ్యక్తి విషపుమొక్కను పొడిచేసి నీళ్లలో కలుపుకుని సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్తూరు సమీపం పెత్తనాయకన్‌పాళయంకు చెందిన మణికంఠన్‌ (24) విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చతురంగపట్టికి చెందిన అర్ముగం కుమార్తె సుహాసిని (18) పొటాషియం సల్ఫేటు మిశ్రమాన్ని సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నర్సింగ్‌పురం కలైంజ్ఞర్‌ కాలనీకి చెందిన రాజేశ్వరి (35) విషం తాగింది. Also Read: ఆత్తూరు సమీపం నరసింగపురానికి చెందిన గుణశేఖరన్‌ భార్య సుధ (32) ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. తలైవాసల్‌ పట్టుదురై గ్రామానికి చెందిన ప్రియాంక (28) గన్నేరుపప్పు మింగి ఆత్యహత్యాయత్నం చేసింది. అదే ప్రాంతానికి చెందిన శివశంకరన్‌ భార్య తేన్‌మొళి (32) పురుగుల మందు తాగింది. వీరంతా లాక్‌డౌన్ కారణంగా రెండ్రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. ఇంటిని జైలులా భావించి మనస్తాపంతోనే ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. తీవ్రత ఇంకా కొనసాగుతున్న తరుణంలో లాక్‌డౌన్ పొడిగిస్తారన్న ప్రచారం కూడా కొందరిని కుంగదీస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. Also Read:


By April 08, 2020 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/7-people-trying-to-suicide-over-lockdown-effect-in-tamil-nadu/articleshow/75040275.cms

No comments