హైదరాబాద్లో వలస కూలీ దారుణహత్య.. అక్రమ సంబంధంపై అనుమానాలు?

హైదరాబాద్ శివారులో ఓ వలస కూలీ దారుణహత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బగ్దేవ్రామ్ అలియాస్ హరిదాస్ (26), భార్య జశోదాదేవి (25)తో కలిసి కొన్నాళ్ల క్రితం కొత్తూరు వలస వచ్చాడు. అక్కడ దంపతులు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నాడు. వీరు అద్దెకుంటున్న గదిలోనే బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ దాస్ (34) కూడా ఉంటున్నాడు. సురేష్దాస్ భార్య లలితాదేవికి, జశోదాదేవికి దూరపు బంధుత్వం ఉండటంతో ముగ్గురు ఒకే గదిలో కలిసి ఉంటున్నారు. Also Read: బుధవారం ఉదయం డాబాపై సురేష్దాస్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న షాద్నగర్ ఏసీపీ సురేందర్, సీఐ చంద్రబాబు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. సురేశ్ తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతడితో గదిలో ఉండే హరిదాస్, జశోదాదేవి దంపతులు కనిపించకపోవడంతో పోలీసులకు వారిపైనే అనుమానం కలిగింది. Also Read: ఒకే గదిలో ఉంటుంటడంతో సురేశ్దాస్, జశోదాదేవి మధ్య ఏర్పడిందా? ఈ విషయం తెలుసుకున్న హరిదాస్ అతడిని చంపేశాడా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్థిక గొడవలూ దీనికి కారణంగా అనుమానిస్తున్నారు. ఆ దంపతుల ఆచూకీ లభిస్తేనే ఈ కేసులో పురోగతి లభిస్తుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. Also Read:
By April 16, 2020 at 08:57AM
No comments