పాక్లో 50 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్... 525 మంది క్వారంటైన్కు

పాకిస్థాన్లో వణికిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా జైళ్లలోని 50 మంది ఖైదీలకు కరోనా సోకడం సంచలనం రేపింది. పంజాబ్ ప్రావిన్స్లోని ఓ జైలులో 50 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో వారందరినీ కరోనా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 525 మంది ఇతర ఖైదీలను ప్రత్యేక గదులకు తరలించామని పాక్ జైళ్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ షాహిద్ బేగ్ చెప్పారు. Also Read: ఇటలీలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన పాక్ పౌరుడిని ఇటీవలే స్వదేశానికి తీసుకొచ్చి జైలులో పెట్టారు. అయితే అతడికి ఎలాంటి పరీక్షలు చేయకుండానే అందరి ఖైదీల మధ్య ఉంచడమే ఇప్పుడు కొపముంచింది. ఆ ఖైదీ ద్వారానే ఇప్పుడు 50 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికారులు షాకయ్యారు. కరోనా వైరస్ ప్రబలుతుందనే భయంతో లాహోర్ క్యాంపు జైలులో ఉన్న 800మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించినట్లు పాక్ జైలు అధికారులు చెప్పారు. దేశంలోని 41 జైళ్లలో ఖైదీలతో ములాఖత్ను ఇప్పటికే నిషేధించినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు. Also Read:
By April 08, 2020 at 10:20AM
No comments