Breaking News

ప్రేమించి పెళ్లాడిన నాలుగు నెలలకే యువతి ఆత్మహత్య.. భర్తపై అనుమానం


ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగు నెలలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన అల్వాల్‌లో వెలుగుచూసింది. ఆమెను భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. Also Read: హస్మత్‌పేటలోని చత్రిగడ్డ బస్తీలో నివసించే శిరీష(23), సతీష్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటూ నాలుగు నెలల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. సతీశ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా శిరీష ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కొద్దిరోజులుగా చెడు అలవాట్లకు బానిసైన సతీశ్ భార్యను వేధిస్తున్నాడు. దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం శిరీష ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి ఇంటికొచ్చిన సతీశ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న శిరీషను చూసి షాకయ్యాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చెప్పడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తమ కూతురిని భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By February 17, 2020 at 12:12PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-woman-commits-suicide-in-alwal-hyderabad/articleshow/74170291.cms

No comments