Breaking News

ఇలాక్కూడా జరుగుతుంది.. మంచంపై నుంచి పడి యువకుడి దుర్మరణం


మద్యం మత్తులో ఓ యువకుడు మంచంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌లో శనివారం వెలుగుచూసింది. మిజోరాం రాష్ట్రానికి చెందిన లాల్‌ నుంచమ(23) ఉపాధి నిమిత్తం కొంత కాలం క్రితం మేడ్చల్‌ జిల్లాకు వలస వచ్చాడు. శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలోని ఓ రిసార్ట్స్‌లో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి ఫుల్లుగా మద్యం తాగాడు. అనంతరం తన గదిలోని మంచం(బంక్‌ బెడ్‌)పై పడుకున్నాడు. Also Read: తెల్లవారు జామున అతడి ఫ్రెండ్ లాల్‌మాల్‌ సౌమ లేచి చూడగా లాల్‌ కింద పడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. దీంతో కంగారుపడిన అతడు వెంటనే రిసార్ట్స్‌ సిబ్బందికి, శామీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 సిబ్బందికి సమాచారమివ్వగా వారు పరిశీలించి అప్పటే మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. లాల్‌ మరణవార్తను మిజోరాంలోని అతడి కుటుంబసభ్యులకు చేరవేశారు. Also Read:


By February 16, 2020 at 12:00PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mizoram-man-died-for-drop-from-bed-while-sleeping-in-hyderabad/articleshow/74157890.cms

No comments