ప్రేమను తిరస్కరించిందని కన్నతల్లినే గొంతు కోసి చంపేసిన బాలిక
ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడి జీవితం నాశనం చేసుకోవద్దని మందలించిన తల్లిని 15ఏళ్ల బాలిక ప్రియుడితో అత్యంత కిరాతకంగా చంపేసింది. Also Read: ఘజియాబాద్కు చెందిన శశి మాలా (44) అనే స్థానిక పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. భర్త, కూతురు(15)తో కలిసి బ్రిజ్ విహార్ కాలనీలో నివాసముంటోంది. పదో తరగతి చదువుతున్న బాలిక ఇటీవల జితేంద్ర అనే యువకుడితో ప్రేమలో పడింది. అతడితో చనువుగా ఉంటూ చదువులో వెనకబడింది. ఈ విషయం తెలుసుకున్న శశి కూతురిని మందలించింది. ప్రేమకు స్వస్తి చెప్పి బుద్ధిగా చదువుకోవాలని హితవు చెప్పింది. Also Read: అయితే తల్లి మాటలు చెవికెక్కించుకోని బాలిక తన ప్రేమకు ఆమె అడ్డొస్తోందని భావించి ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ ఆలోచించుకుని చివరకు ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. శశి భర్త ఓ పని నిమిత్తం శుక్రవారం స్వస్థలమైన బీహార్కు వెళ్లాడు. అదే అదనుగా భావించిన బాలిక శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి శశిని గొంతు కోసి చంపేశారు. మరుసటి రోజు ఇంటికొచ్చిన భర్త బెడ్రూమ్లో భార్య విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఢిల్లీలోని జీబీటీ ఆస్పత్రికి తరలించారు. Also Read: అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యాడు. అసలేం జరిగిందని కూతురిని నిలదీయగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘజియాబాద్ సిటీ ఎస్పీ మనీశ్ మిశ్రా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కూతురిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు ప్రియుడు జితేంద్రను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. Also Read:
By February 16, 2020 at 11:34AM
No comments