Breaking News

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థి మిస్టరీ డెత్.. డీమార్ట్ సిబ్బంది కొట్టి చంపారా?


వనస్థలిపురం దగ్గర ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలంరేపింది. ఆదివారం రాత్రి షాపింగ్‌కు వెళ్లిన సతీష్ తెల్లవారే సరికి శవమై కనిపించాడు. నల్గొండ జిల్లాకు చెందిన సతీష్ నాయక్ హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి తన స్నేహితులతో కలిసి షాపింగ్ చేసేందుకు వనస్థలిపురంలో ఉన్న డీమార్ట్‌‌కు వెళ్లాడు. షాపింగ్ చేస్తున్న సమయంలో డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బందికి సతీష్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాటా మాటా పెరిగి పరిస్థితి చేయి చేసుకునే వరకు వెళ్లింది కొద్దిసేపటికి సతీష్ కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారట. అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వెంటనే కాలేజీ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది కొట్టడంతో సతీష్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాక్లెట్ విషయంలో జరిగిన గొడవతోనే దాడి చేశారని.. ఆ దెబ్బలు తాళలేక ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారు. డీమార్ట్ సిబ్బందిపై సతీష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ కుమారుడ్ని బయటకు పంపించిన కాలేజీ యాజమాన్యంపైనా కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


By February 17, 2020 at 11:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-intermediate-student-suspected-death-in-vanasthalipuram-d-mart/articleshow/74169147.cms

No comments