హైదరాబాద్లో కీచక ఎస్ఐ.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అఫైర్, ఆమె తల్లిని కూడా
తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మహిళను లోబరుచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్న ఎస్ఐ నీచపు కథ ఇది. విచారణ పేరుతో తరుచూ ఆమె ఇంటికెళ్లి మహిళ తల్లితోనూ లైంగిక సంబంధం పెట్టుకుని పోలీసులకే మాయని మచ్చ తెచ్చాడు. ఫ్రెండ్లీ పోలీస్ అనే చెప్పే హైదరాబాద్ మహానగరంలోనే ఈ దారుణ ఘటన జరగడం పోలీసు శాఖనే నివ్వెరపరుస్తోంది. Also Read: మాదాపూర్ జోన్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్కు కొన్నా్ళ్ల క్రితం ఓ వివాహిత ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వివాహితపై కన్నేసిన స్టేషన్ ఎస్ఐ తాను సాయం చేస్తానంటూ ఆమెను నమ్మించి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. విచారణ పేరుతో ఆమెతో తరుచూ మాట్లాడుతూ ఇంటికి కూడా వెళ్లేవాడు. పలు దపాలుగా ఆమె నుంచి రూ.5లక్షల వరకు దోచేశాడు. ఆ ఎస్ఐ చేసే హడావుడి చూసి తనకు న్యాయం జరుగుతుందని ఆ మహిళ నమ్మింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. Also Read: ఈ క్రమంలోనే ఆ ఎస్సై మహిళ తల్లితోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరిపై అనుమానంతో ఆ మహిళ ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి , తనతో తల్లితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు అదే పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. అయితే నిందితుడు తనకున్న పలుకుబడితో ఆ ఫిర్యాదును తొక్కిపెట్టేశాడు. తర్వాత అతడు శంషాబాద్ జోన్లోని మరో స్టేషన్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. Also Read: దిశ ఘటన తర్వాత సైబరాబాద్ పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడంతో బాధితురాలు చొరవ చేసి తనకు జరిగిన అన్యాయాన్ని సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ ఎస్ఐపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అతడు కొద్దిరోజులు విధులు హాజరుకావడం లేనట్లు తెలుస్తోంది. Also Read:
By February 18, 2020 at 11:37AM
No comments