Breaking News

కేటీఆర్ పీఏనంటూ మోసం, మాజీ క్రికెటర్ అరెస్ట్.. జగన్, ఎమ్మెస్కే పేరుతోనూ మోసాలు


తెలంగాణ మంత్రి పీఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న మాజీ క్రికెటర్‌‌ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ తరఫున రంజీ ట్రోఫీల్లో క్రికెట్ ఆడిన బుడుమురు నాగరాజు ఆ తర్వాత కెరీర్లో నిలదొక్కుకోలేకపోయాడు. జల్సాలకు అలవాటు పడటంతో మోసాలకు తెరదీశాడు. వ్యాపారవేత్తలను సెల్‌ఫోన్ నంబర్లు సేకరించి మంత్రికేటీఆర్ పీఏ తిరుపతిని అంటూ ఫోన్ చేసి మోసం చేసేశాడు. Also Read: శ్రీకాకుళం జిల్లాకు చెందిన రంజీ క్రికెట్‌ నాగరాజు పేదవాడని, అతడికి క్రికెట్‌ కిట్‌ స్పాన్సర్‌ చేయమంటూ నమ్మించి బురిడీ కొట్టించేవాడు. ఇలా అనేకమందిని నమ్మించి మోసం చేశాడు. గతేడాది డిసెంబర్‌ 26న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)కి డిసెంబర్‌ 26న ఫోన్‌కాల్‌ చేసి కేటీఆర్‌ పీఏ పేరుతో మాటలు కలిపాడు. ‘ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెటర్‌ నాగరాజు బుడుమురు అండర్‌ 25 వరల్డ్‌కప్‌కు, టీ20 సన్‌రైజర్స్‌ టీమ్‌కు ఎంపికయ్యాడు. అతడిది నిరుపేద కుటుంబమని క్రికెట్‌ కిట్‌కు, పర్యటన కోసం స్పాన్సర్‌షిప్‌ కావాలంటూ నమ్మించాడు. సంస్థ లోగో ఆ క్రికెట్‌ కిట్‌పై ప్రదర్శిస్తామని, ఆ కిట్‌ను కేటీఆరే స్వయంగా నాగరాజుకు అందజేస్తారు’ అని నమ్మించాడు. Also Read: అతడి మాటలు నమ్మిన సీఎండీ అతడు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు రూ.3.30లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ తర్వాత నాగరాజు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆయన జనవరి 13న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నాగరాజును శనివారం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, ఏపీ సీఎం జగన్‌ పేరుతోనూ అనేక మోసాలకు పాల్పడిన కేసులో గతంలో అరెస్టయ్యాడు. Also Read:


By February 16, 2020 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ap-former-ranji-cricketer-nagaraju-arrested-in-hyderabad/articleshow/74157285.cms

No comments