Breaking News

కన్నకొడుకుకు అత్యంత కిరాతకంగా చంపేసి... శరీరాన్ని ముక్కలు చేసిన తల్లి


ఉన్నత చదువులు చదివిన కొడుకు మద్యానికి బానిసై వేధిస్తుండటంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తమ్ముడు ప్రేమపెళ్లి చేసుకోవడంతో తనకూ పెళ్లి చేయాలని నిత్యం గొడవపడేవాడు. కొడుకు వేధింపులు భరించలేక ఆ తల్లి నవమాసాలు కనిపెంచిన కొడుకు ప్రాణాలే తీసింది. అంతటితో ఆగకుండా శరీరాన్ని ముక్కలు చేసి వేర్వేరు చోట్ల పడేసింది. Also Read: తేని జిల్లా కంబం వద్ద ఉన్న సురుళిప్పట్టి రోడ్డులో ముల్లైపెరియార్‌కి వెళ్లే మార్గంలో సోమవారం ఓ సంచిలో యువకుడి శరీర భాగాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయం బయటపడింది. Also Read: తేని జిల్లా కంబం ప్రాంతానికి చెందిన ఆ మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు విఘ్నేశ్వరన్‌ (30), విజయ్‌ ప్రశాంత్‌ (26) అనే ఇద్దరు కుమారులున్నారు. విఘ్నేశ్వరన్‌ ఇంజినీరింగ్‌ చదివి, కోయంబత్తూరులోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. రెండుసార్లు మద్యం తాగి కాలేజీకి వెళ్లడంతో యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఉద్యోగం పోవడంతో మద్యం ఖర్చులకు ఇంట్లోనే దొంగతనం చేసేవాడు. దీంతో తల్లి అతడితో నిత్యం గొడవపడేది. Also Read: ఈ క్రమంలోనే చిన్నకొడుకు విజయ్ ప్రశాంత్ ప్రేమ వివాహం చేసుకుని భార్యతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడు. తనకు పెళ్లి కాకుండా తమ్ముడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటూ రోజూ తల్లిని వేధించేవాడు. దీంతో విసిగిపోయిన తల్లి విఘ్నేశ్వరన్‌కి ఆదివారం విషం కలిపిన ఆహారం పెట్టి చంపేసింది. మృతదేహాన్ని ముక్కలు చేసి వేర్వేరు చోట్ల పడేసింది. సోమవారం రాత్రి తలను కనుగొన్న పోలీసులకు కాళ్లు, చేతులు మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:


By February 19, 2020 at 12:04PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-mother-kills-son-addicted-to-alcohol/articleshow/74203918.cms

No comments