చెవిలో వేయాల్సిన మందు నోట్లో వేయడంతో 2నెలల బాలుడు మృతి.. హాస్పిటల్పై దాడి
జిల్లా శంకరపల్లిలో విషాదం నెలకొంది. వైద్యం వికటించి రెండు నెలల వయసున్న బాలుడు మృతిచెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయాడని ఆరోపించిన బంధువులు హాస్పిటల్పై దాడి చేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేసి, అంబులెన్స్ అద్దాలు పగులగొట్టారు. Also Read: శంకర్పల్లికి చెందిన దంపతులకు 2 నెలల బాలుడు ఉన్నాడు. సోమవారం బాబు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో వారు శంకర్పల్లిలోని అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి బాబును ఇంటికి పంపేశారు. రాత్రి ఒంటి గంట సమయంలో చిన్నారికి మళ్లీ అదే సమస్య రావడంతో మరోసారి హాస్పిటల్కు తీసుకొచ్చారు. నెప్లేజర్ ట్రీట్మెంట్కు బాలుడు స్పందించకపోవడంతో డాక్టర్ యాంటీ బయోటిక్ మెడిసిన్ను చెవిలో వేయమని నర్సుకు శాంతకు చెప్పారు. Also Read: అయితే నర్సు పొరపాటున ఆ మందును బాలుడి నోట్లో వేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్లోని లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. పిల్లాడిని పరీక్షించిన డాక్టర్లు ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయాడని చెప్పడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బాబు మృతదేహంతో అమృత హాస్పిటల్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్పిటల్పై దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అమృత హాస్పిటల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By February 18, 2020 at 02:02PM
No comments