ప్రాణం తీసిన సెల్ఫీ.. చెరువులో పడి ఇంటర్ విద్యార్థి మృతి
స్మార్ట్ఫోన్లు వినియోగం పెరిగాక అందరికీ సెల్ఫీల పిచ్చి పట్టుకుంది. ఎక్కడికెళ్లినా సెల్ఫీ తీసుకోవడం సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇదే విధంగా ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు చెరువులోకి దిగి చనిపోయాడు. Also Read: జిల్లా పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సిద్ధాబత్తుని హనూక్(16) బుధవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి మధ్యాహ్నం కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు. భోజనం అనంతరం వీరు ముగ్గురు పట్టణ శివారులో ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. హనూక్ సెల్ఫోన్లో సెల్ఫీ దిగేందుకు చెరువు అంచు వద్దకు వెళ్లాడు. గట్టు పైనుంచి ఒక్కసారిగా చెరువులోకి జారిపడిపోయాడు. Also Read: అతడిని రక్షించేందుకు ఫ్రెండ్స్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. హనూక్ సిద్ధాబత్తుని అప్పారావు, గ్రేసి టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By November 21, 2019 at 11:51AM
No comments