ఆదిలాబాద్ రిమ్స్లో క్షుద్రపూజలు.. డాక్టర్లపై అనుమానాలు

ఆదిలాబాద్లోని రిమ్స్లోని కలకలం రేపాయి. రిమ్స్ వైద్య కళాశాలలోని బయోకెమిస్ట్రీ విభాగంలో గత ఆదివారం (నవంబర్ 17) వైద్యులు క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ గదిలో ఎండు మిరపకాయలు, పసుపు తదితర క్షుద్ర పూజ సామగ్రి కనిపించిందని రిమ్స్లో వందతులు వ్యాపించాయి. Also Read: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు క్షుద్రపూజలు చేస్తుండగా చూశాడని చెబుతుండగా, మరికొందరేమో బయోకెమిస్ట్రీ విభాగంలో పనిచేసే ప్రొఫెసర్ను అప్రతిష్ఠ పాలు చేసేందుకే ఎవరో ఈ ప్లాన్ వేశారని ప్రచారం జరుగుతోంది. Also Read: రిమ్స్లో క్షుద్రపూజలు జరగలేదని, ఎవరో గదిలో పసులు, కుంకుమతో పాటు ఆ పూజలకు వాడే వస్తువులను ఉద్దేశపూర్వకంగానే వేశారని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా క్షుద్రపూజల వ్యవహారం రిమ్స్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. దీనిపై స్పందించిన యాజమాన్యం నిజానిజాలు తేల్చేందుకు అంతర్గతంగా ఓ కమిటీని నియమించి దర్యాప్తు చేయిస్తోంది. Also Read:
By November 25, 2019 at 08:49AM
No comments