Breaking News

కోడలికి షాకిచ్చిన కోర్టు.. అత్తపై దాడి కేసులో ఆర్నెల్ల జైలుశిక్ష


ఇంటి ముందు తలెత్తిన చిన్న వివాదంలో అత్తపై దాడికి పాల్పడిన కోడలికి కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మండలంలోని తూర్పుపాలెం పంచాయతీ పరిధిలోని బడేవారిపాలెంలో యడం శివనాగులు, యడం బుజ్జమ్మ వరుసకు అత్తాకోడళ్లు. పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నా వారిద్దరికి ఎప్పుడూ పడేది కాదు. Also Read: నిత్యం ఏదొక గొడవ పడుతూ చుట్టుపక్కల వారికి కూడా చికాకు తెప్పించేవారు. 2015లో ఇంటి ముందు మట్టి తీసే విషయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో బుజ్జమ్మ తన చేతిలోని పారతో అత్తపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన శివనాగులును స్థానికులు ఆస్పత్రికి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. Also Read: శివనాగులు ఫిర్యాదుతో చెరుకుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగేళ్ల విచారణ తర్వాత బుజ్జమ్మపై నేరం నిరూపితం కావడంతో రేపల్లె కోర్టు ఆమెకు ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడంతో బుజ్జమ్మ ఇప్పుడు ఆరు నెలలు జైల్లో కూర్చోవాల్సి వచ్చింది.


By October 04, 2019 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/guntur-woman-gets-6-month-prison-over-attack-on-mother-in-law/articleshow/71433074.cms

No comments