నైట్క్లబ్లో మహిళపై గ్యాంగ్ రేప్... బాధితురాలే ఆఫర్ ఇచ్చిదంటూ నిందలు

బ్రిటన్లోని నైట్క్లబ్లో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులకు కోర్టు దోషులుగా నిర్ధారించింది. లండన్లో న్యాయవాద విద్య అభ్యసిస్తున్న ఇటలీకి చెందిన ఇద్దరు యువకులు 2017, ఫిబ్రవరి 25న ఓ నైట్ క్లబ్కు వెళ్లారు. అక్కడ పరిచయమైన ఓ మహిళను మాయమాటలతో రెస్ట్ రూమ్కి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలిని బాత్రూమ్లో పడేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రెండేళ్లకు పైగా కొనసాగుతున్న విచారణలో భాగంగా అక్టోబర్ 15న లండన్ న్యాయస్థానం వారిద్దరిని దోషులుగా నిర్ధారించింది. Also Read: నైట్క్లబ్లో పరిచయమైన ఆ మహిళే తమకు సెక్స్ ఆఫర్ ఇచ్చిందని నిందితులు చేసిన వాదనలను కోర్టు కొట్టేసింది. ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లుతున్నట్లు వీడియోలు స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటిది బాధితురాలిపైనే నిందలు ఎలా వేస్తారని కోర్టు నిందితుల తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. అత్యాచారానికి గురైన బాధితురాలి జననాంగాల వద్ద డాక్టర్లు సర్జరీ చేయాల్సి వచ్చిందని, ఆమె ఇష్టపూర్వకంగానే సెక్స్కు అంగీకరిస్తే అంతటి గాయాలు అవుతాయా? అని నిలదీసింది. Also Read:
By October 28, 2019 at 09:55AM
No comments