Breaking News

జాబ్‌లో చేరిన 3 నెలలకే లంచం కోసం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వీఆర్వో


ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎంతో శ్రమించాలి. ఏళ్ల తరబడి కష్టపడి చదవగానే సరిపోదు.. అదృష్టం కూడా కలిసొస్తేనే సర్కారీ కొలువు దక్కుతుంది. ఎంతో శ్రమించి గవర్నమెంట్ జాబ్ కొట్టినవారు.. అంకితభావంతో సమాజానికి మేలు చేయడానికి శ్రమించాలి. కానీ వీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే ఓ యువకుడు లంచం కోసం పరితపించాడు. రైతు ఫిర్యాదుతో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి చిక్కుల్లో పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. సరూర్‌నగర్‌ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన జక్కిడి ముత్యంరెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయాంజాల్‌ పరిధిలో 1.29 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దాన్ని తన పేరు మీద మ్యుటేషన్‌ చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మ్యుటేషన్ చేయడానికి తుర్కయాంజాల్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. ఆయన జూలైలోనే ఉద్యోగంలో చేరారు. అంత మొత్తం ఇచ్చుకోలేనన్న ముత్యంరెడ్డి రూ.75 వేలు ఇచ్చేందుకు వీఆర్వోతో ఒప్పంద కుదుర్చుకున్నారు. ముందుగా రూ. 50 వేలు, పని పూర్తయ్యాక మిగతా రూ. 25 వేలు చెల్లించడానికి డీల్ ఓకే అయ్యింది. వీఆర్వో లంచం డిమాండ్ చేస్తున్నారని ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలోని కమ్మగూడలో వీఆర్వో శంకర్‌ రూ.50 వేలు లంచ్ తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన శంకర్‌ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం కోసం తీసుకెళ్లారు. ఇలాంటి లంచావతారుల కారణంగానే సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థనే రద్దు చేసే యోచనలో ఉన్నారనిపిస్తోంది.


By October 04, 2019 at 08:35AM


Read More https://telugu.samayam.com/telangana/news/turkayamjal-vro-arrested-by-the-acb-officials-for-accepting-bribe-from-real-estate-agent/articleshow/71433326.cms

No comments