Breaking News

TDP: శివ ప్రసాద్ మరణం.. మంత్రి పెద్దిరెడ్డి భావోద్వేగం


టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ పార్థివ దేహానికి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి నివాళులు అర్పించారు. కుటుంబీకులను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాలకు అతీతంగా తమ ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉందని మంత్రి తెలిపారు. శివ ప్రసాద్ విలక్షణమైన వ్యక్తి అన్న పెద్దిరెడ్డి.. ఆయనకు రాజకీయాలతో అతీతంగా అభిమానులు ఉన్నారన్నారు. శివ ప్రసాద్ అకాల మరణం జిల్లాకు తీరని లోటని పెద్దిరెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. అన్నయ్య అని ప్రేమతో పిలిచే నేతను కోల్పోయామని పెద్దిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై హాస్పిటల్‌లో చికిత్స పొందిన శివ ప్రసాద్.. శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన పార్థీవ దేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన స్కూల్ మేట్ అయిన శివప్రసాద్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు తిరుపతి రానున్నారు.


By September 22, 2019 at 10:20AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-minister-peddireddy-ramachandra-reddy-gets-emotional-over-former-mp-sivaprasad-death/articleshow/71241340.cms

No comments