Breaking News

భర్తపై అలిగి వెళ్లిపోయిన వివాహిత.. నమ్మించి రేప్ చేసిన ఆటోడ్రైవర్


భర్తతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ ఆటోడ్రైవర్ చేతిలో అత్యాచారానికి గురైంది. విజయనగరం బాబామెట్టకు చెందిన యువతికి విశాఖ జిల్లా మండలం మర్రిపాలెంకు చెందిన యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఆగస్టు 27వ తేదీన ఇంట్లో పెద్ద గొడవ జరగడంతో రాత్రి సమయంలో వివాహిత ఇద్దరు పిల్లలను తీసుకుని విజయనగరంలోని పుట్టింటికి వెళ్లేందుకు బయలుదేరింది. Also Read: నర్సీపట్నంలో బస్సెక్కి రాత్రి 12 గంటల సమయంలో మధురవాడ బస్టాండ్‌కు చేరుకుంది. ఆ సమయంలో విజయనగరం వైపు వెళ్లే బస్సులు లేకపోవడంతో సమీపంలోని ఫ్రెండ్ ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచిచూస్తోంది. అటుగా వచ్చిన ఆటోడ్రైవర్ ఆమెను పలకరించి అటువైపే వెళ్తు్న్నానని చెప్పి ఇద్దరు పిల్లలతో పాటు ఆమెను ఎక్కించుకున్నాడు. ఆటోను దారి మళ్లించడంతో ఆమె డ్రైవర్‌ను ప్రశ్నించింది. అయితే ఆటోకు సరైన ధ్రువపత్రాలు లేవని.. అందుకే వేరే రూట్‌లో తీసుకెళ్తున్నానని చెప్పడంతో ఆమె నమ్మింది. అలా చాలాసేపు ప్రయాణించి చిన్నయ్యపాలెం సమీపంలోని తోటల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ వివాహితను బెదిరించి సెల్‌ఫోన్, రూ.14వేల నగదు, పాప చెవి రింగులు దోచుకున్నాడు. నిస్సహాయంగా ఉన్న మహిళను పిల్లల ఎదుటే చేశాడు. తనను వదిలేయాలని ఆమె ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా పశువులా ఆమెపై పడి తన కోరిక తీర్చుకున్నాడు. అనంతరం ఆ ముగ్గురిని అక్కడే వదిలేసి పారిపోయాడు. Also Read: అయితే ఆటోడ్రైవర్‌తో పెనుగులాడిన సమయంలో అతడు దోచుకున్న ఆమె సెల్‌ఫోన్ అక్కడే పడిపోయింది. దీంతో బాధితురాలు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో వారు చిన్నయ్యపాలెం చేరుకుని బాధితురాలిని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఆ పరిధి ఆనందపురం పీఎస్ పరిధిలోకి వస్తుందని పోలీసులు చెప్పడంతో అక్కడ కేసు నమోదుచేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. Also Read:


By September 12, 2019 at 09:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/auto-driver-rapes-woman-in-vizag-district/articleshow/71090720.cms

No comments