Breaking News

కార్పోరేటర్ ఆస్పత్రిలో కామాంధుడు.. బాలింతపై వికృత చేష్టలు


కాన్పు కోసం కార్పోరేట్ ఆస్పత్రికి వచ్చిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. బిడ్డను ప్రసవించి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెపై 50ఏళ్ల వార్డు బాయ్ అఘాయిత్యానికి యత్నించాడు. ఈ విషయాన్ని బాధితురాలు భర్తకు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: మెహదీపట్నం ప్రాంతంలో నివసించే ఓ మహిళకు నెలలు నిండటంతో ప్రసవం కోసం ఆగస్టు 24వ తేదీన రోడ్ నంబర్ 12లో గల సెంచురీ ఆస్పత్రిలో చేరింది. 26వ తేదీన ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ఆ వార్డులో బాయ్‌గా పనిచేస్తున్న గుడిమల్కాపూర్‌కు చెందిన అచ్యుతరావు(50) ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమె శరీర భాగాలను చేతులు వేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. Also Read: అచ్యుతరావు చేష్టలు తెలుస్తున్నా అడ్డుకోలేని స్థితిలో బాధితురాలు నిస్సహాయంగా ఉండిపోయింది. శనివారం బాలింత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో డాక్టర్లు వెంటిలేటర్ తొలగించి సాధారణ వార్డుకు మార్చారు. బాధితురాలు తనకు ఎదురైన పరిస్థితిని భర్తకు చెప్పడంతో కోపోద్రిక్తుడైన అతడు వార్డుబాయ్‌పై చేయి చేసుకోబోయాడు. అతడిని ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత బాధితురాలి భర్త బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. బాలింత నుంచి వాంగ్మూలం తీసుకుని అచ్యుతరావును అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. Also Read:


By September 01, 2019 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/corporate-hospital-ward-boy-arrested-for-misbehaving-on-woman-patient-in-hyderabad/articleshow/70932519.cms

No comments