కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనర్హతను సమర్దించిన హైకోర్టు

గతేడాది తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురయ్యింది. భూపతిరెడ్డి పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అనర్హుడిగా ప్రకటించడాన్ని న్యాయస్థానం సమర్ధించింది. ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధమైన అంశాలు తమకు కనిపించలేదని, రాజ్యాంగంలో షెడ్యూల్ 10లోని 8వ పేరా సమర్థనీయమేనని కోర్టు స్పష్టం చేిసంది. శాసన మండలి అనర్హత నిబంధనల్లోని 7(4) రాజ్యాంగబద్ధమేనని పేర్కొన్న హైకోర్టు, భూపతిరెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు 8వ పేరా మౌలిక నిర్మాణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మండలి ఛైర్మన్కు అధికారం కల్పించే ఈ నిబంధన రాజ్యాంగ పరిధిలోనే ఉందని, ఇది చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. అంతేకాదు తెలంగాణ శాసనమండలి అనర్హత నిబంధనల్లోని 7(4) రాజ్యాంగ విరుద్ధమనడానికి ఎలాంటి ఆధారాల్లేవని తెలిపింది. భూపతిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించడంలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలూ లేవని, నిబంధనలకు లోబడే ఆయన నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. భూపతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవంటూ పిటిషన్ను కొట్టివేసింది. ఫిరాయింపుల నిబంధనలతోపాటు తనను అనర్హుడిగా ప్రకటిస్తూ జనవరి 16న మండలి ఛైర్మన్ వెలువరించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్సీ ఆర్.భూపతిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ భూపతిరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో అతడిని పార్టీ ఫిరాయింపుల వేటు పడింది.
By July 18, 2019 at 09:15AM
No comments