Breaking News

కె.రాఘ‌వేంద్ర‌రావు కొత్త స్కెచ్.. వర్కవుటవుద్దా?


ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తీశారు. అయితే ఈయన గత కొంత కాలం నుండి భక్తిరస చిత్రాలు మాత్రమే తీసుకుంటూ వస్తున్నారు. అతని గత చిత్రం ఓం నమో వెంకటేశాయ...ఫెయిల్ అయింది. ఇక ఇప్పుడు అందుకే ఓ కొత్త ఆలోచనతో ముందు వస్తున్నారు.

ముగ్గురు ద‌ర్శ‌కులు, ముగ్గురు క‌థానాయిక‌ల‌తో ఓ సినిమా రూపొందించ‌డానికి ఆయ‌న సన్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ మూవీని కె.రాఘ‌వేంద్ర‌రావుతో పాటు బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్ల‌గ‌డ్డ‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఆ ముగ్గురు దర్శకులు కేవలం నటనకు మాత్రమే ప‌రిమితం అవుతారు. ఈ ముగ్గురు దర్శకులని మరో దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడు అని తెలుస్తుంది. అలానే ఈ ముగ్గురు దర్శకులకి ముగ్గురు క‌థానాయిక‌లు కూడా ఉన్నారట.

మరి ఆ ముగ్గురు ద‌ర్శ‌కులు, ఆ ముగ్గురు క‌థానాయిక‌లు ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అసలు దీన్ని రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే దర్శకుడితో డైరెక్ట్ చేయిస్తాడా? అన్నది తెలియాల్సిఉంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.



By May 25, 2019 at 06:24PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46077/k-raghavendra-rao.html

No comments