Breaking News

ఆది తో బాణం హీరోయిన్!!


ఆది సాయికుమార్, వేదిక హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళ బై లింగ్వుల్ చిత్రం నేడు లాంఛ‌నంగా ప్రారంభమైంది. కార్తీక్ విఘ్నేశ్ ద‌ర్శ‌కుడు. హీరోయిన్ వేదిక న‌టిస్తున్న నాలుగో తెలుగు చిత్ర‌మిది. మార్చి 25 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని త‌ల‌కోన‌లో ప్రారంభం కానుంది. రోబో, 2.0 చిత్రాల‌కు అసోసియేట్ కెమెరామెన్‌గా ప‌నిచేసిన గౌత‌మ్ జార్జ్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సి.స‌త్య సంగీతాన్ని అందిస్తున్నారు.

అర్జున్ సుర‌వ‌రం చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ పై.లి. బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న రెండో చిత్ర‌మిది. నిర్మాణంలో న్యూ ఏజ్ సినిమా, తిరు కుమర‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అసోసియేట్ అవుతున్నారు.  ఈ సినిమా మిగ‌తా న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తారు. 



By March 19, 2019 at 08:31AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45191/aadi-saikumar.html

No comments