Breaking News

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా మూవీ ఫిక్సయింది


మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో పరిచయం కానున్నారు. ఆయన మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా  ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైట‌ర్‌గా కూడా పనిచేశారు.  ఈ నూత‌న చిత్రానికి ప‌నిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూర్చ‌నున్నారు.



By October 27, 2018 at 04:00PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43214/vaishnav-tej.html

No comments