Breaking News

దర్భంగా పేలుడు: కుటుంబానికి రా ఏజెంట్లమని నమ్మించి ఉగ్ర కార్యకలాపాలు!


దర్భంగా పేలుళ్ల ఘటనపై దర్యాప్తులో సంచలనం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన .. తాము ఇండియన్ ‘రా’ ఏజెంట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించారు. సోదరులిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో వీరు తాము ‘రా’ ఏజెంట్లమని, ఓ ఆఫీసర్ తమకు టాస్క్ అప్పగించారని, దాని కోసమే తాము పని చేస్తున్నట్టుగా నమ్మబలికారు. అయితే దర్భంగా పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు మాలిక్ సోదరుల అరెస్ట్ తరువాత వారి తండ్రి మూసాఖాన్ స్పందించారు. మాజీ సైనికుడైన ఆయన... ఒక సైనికుడి కుమారులు ఉగ్రవాదులుగా మారడం జీర్ణించుకోలేకపోయారు. వెంటనే స్పందించి అధికారులకు విషయం తెలియజేశాడు. తమ కుమారులు ‘రా’ కోసమే పని చేస్తున్నారని మీడియా ముందు కూడా వెల్లడించారు. సోదరులిద్దరూ కుటుంబ సభ్యుల్ని సైతం బురిడీ కొట్టించి ఉగ్ర కార్యాచరణ చేశారు. 2012లో పాకిస్థాన్ వెళ్తున్నప్పుడు తాము రా పని మీదే వెళ్తున్నామని నాసిర్ మాలిక్ చెప్పాడు. అంతేకాదు పాక్, అఫ్గనిస్థాన్ సరిహద్దులోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ క్యాంప్‌లో మాలిక్ సోదరులు శిక్షణ తీసుకున్నట్లుగా విచారణలో వెల్లడించారు. నాలుగు నెలలపాటు పాకిస్థాన్‌లోనే ఉండి ఉగ్రవాదుల శిక్షణ తీసుకున్న అనంతరం 2016లో దుబాయ్ వెళ్లారు. ఐఈడీ అమర్చడంలో నాసిర్ మాలిక్ మాస్టర్ మైండ్. హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడానికి ముందు ఎన్ఐఏ అధికారులు.. మాలిక్ సోదరుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టి దర్యాప్తు కొనసాగించారు. పక్కా సమాచారం సేకరించిన అధికారులు.. దర్భంగా పేలుళ్ల వెనుక భారీ కుట్ర ఉన్నట్టు అనుమానించారు. దీంతో హైదరాబాద్ చేరుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. మాలిక్ సోదరుల తండ్రి మూసాఖాన్ ఆర్మీలో పనిచేసి.. 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని కాయస్తవాడలో పెళ్లి సామాగ్రి వ్యాపారం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. దేశం కోసం పోరాడిన సైనికుడి కొడుకులు దేశద్రోహులుగా మారడం ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.


By July 04, 2021 at 02:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/darbhanga-blast-suspects-posed-raw-agent-and-cheating-his-family/articleshow/84112594.cms

No comments