‘భారత వ్యాక్సిన్పై నమ్మకం లేనివారు పాకిస్థాన్ వెళ్లిపోవచ్చు..’
భారత్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్పై నమ్మకంలేని వారు పాకిస్థాన్ వెళ్లిపోవచ్చంటూ యూపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశం మీద, ఇక్కడి శాస్త్రవేత్తల మీద నమ్మకంలేని వారు ఆ దారి చూసుకోవచ్చంటూ మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశం సిద్ధమైన వేళ టీకాపై వస్తున్న వందతులను ఉద్దేశించి మీరట్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో పంది మాంసం వినియోగించారంటూ ఒక వర్గానికి చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇది చాలా దురదృష్టకరం. కొంత మంది ముస్లింలకు మన దేశం మీద నమ్మకంలేదు. మన సైంటిస్టుల మీద, పోలీసు వ్యవస్థ మీద, ప్రధాని మీద నమ్మకం లేదు. వారి ఆత్మ పాకిస్థాన్లోనే ఉంది. అలాంటి వారు నిర్మొహమాటంగా పాక్ వెళ్లిపోవచ్చు. భారత శాస్త్రవేత్తల మీద అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అక్కర్లేదు’ అని మీరట్ బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. Also Read:
By January 13, 2021 at 09:51AM
No comments