Breaking News

హైదరాబాద్: అద్దె ఇవ్వలేదని దంపతులపై యజమాని కొడుకు దాడి


ఇంటి అద్దె చెల్లించలేదన్న ఆక్రోశంతో దంపతులపై యజమాని కొడుకు దాడికి పాల్పడిన ఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాలానగర్‌లోని పంచశీల కాలనీకి చెందిన గోవిందరాజు ఇంట్లో దీపక్‌ (28), అంజుదేవి (25) దంపతులు ఆరేళ్లుగా అద్దెకుంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న దీపక్‌ లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆరు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. Also Read: దీంతో కర్ణాటకలో ఉంటున్న గోవిందరాజు తన కుమారుడు మహేష్‌ (25)తో కలిసి ఆదివారం ఆ ఇంటికి వచ్చారు. నెలకు రూ.2,500 చొప్పున 6 మాసాలుగా అద్దె ఇవ్వడం లేదని మొత్తం రూ.15వేలు ఇవ్వాలని అంజుదేవిని అడగ్గా ఆమె భర్త దీపక్‌కు ఫోన్‌ చేసింది. ఇంట్లో ఉన్న రూ.2 వేలు ఇవ్వాలని, మిగతాది తర్వాత ఇస్తామని చెప్పమనడంతో అంజుదేవి వారికి రూ.2వేలు ఇచ్చింది. కాసేపటి తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చిన దీపక్‌ను తనతో రావాలని ఇంటి యజమాని కుమారుడు మహేష్‌ అడిగాడు. Also Read: దీంతో బైక్‌ ఎక్కిన దీపక్‌పై మహేష్‌ ఇనుపరాడ్డుతో దాడి చేసి తల, కుడి భుజం, చేతులపై ఇష్టానుసారం కొట్టాడు. అడ్డొచ్చిన దీపక్‌ భార్య అంజుదేవి తల, కుడిచేతిపై ఇనుపరాడ్డుతో గట్టిగా కొట్టి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దంపతులను ఆస్పత్రికి తరలించారు. మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీపక్ తమ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నాడని, ఎన్నిసార్లు ఖాళీ చేయాలని అడిగినా వినకపోవడంతోనే దాడి చేసినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. Also Read:


By September 07, 2020 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/house-owner-son-attaks-on-tenants-in-hyderabad-case-booked/articleshow/77971566.cms

No comments