పరాయి వ్యక్తితో భార్య అఫైర్.. నోట్లో యాసిడ్ పోసి చంపేసిన భర్త

వ్యవహారంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లా సాలూరులో వెలుగుచూసింది. మార్చి 29న సాలూరు కోటవీధిలో బొర్రా పావని అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీనిపై కేసు నమోదు చేసి భర్త తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. Also Read: శంబరకు చెందిన పావనితో తిరుపతిరావుకు 2011లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల పాటు ఉపాధి కోసం చెన్నైలో జీవించిన ఈ దంపతులు గతేడాది సాలూరుకు వచ్చేశారు. తిరుపతిరావు భార్యా పిల్లలను స్వగ్రామంలో ఉంచేసి మళ్లీ చెన్నైకి వెళ్లాడు. ఈ క్రమంలోనే పావతి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న తిరుపతిరావు భార్యతో అనేకసార్లు గొడవ పడ్డాడు. దీనిపై ఇద్దరు పోలీస్స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. Also Read: లాక్డౌన్ కారణంగా కొద్దిరోజుల క్రితం తిరుపతిరావు ఇంటికి వచ్చేశాడు. మార్చి 29వ తేదీన పావని ప్రియుడిని కలిసేందుకు బయలుదేరింది. ఈ విషయం తెలుసుకున్న తిరుపతిరావు ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించగా నీకెందుకు చెప్పాలి? అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీంతో కోపంతో రెచ్చిపోయిన తిరుపతిరావు భార్యను గదిలో బంధించి కాళ్లు, చేతులు కట్టేశాడు. అనంతరం బాత్రూమ్లో వాడే యాసిడ్ తాగించాడు. అప్పటికీ పావని చనిపోకపోవడంతో మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేశాడు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తే హంతకుడని తేల్చి శనివారం అతడిని అరెస్ట్ చేశారు. Also Read:
By April 12, 2020 at 10:37AM
No comments