నర్సుతో ప్రేమాయణం.. యువకుడి సజీవ దహనం

ప్రేమ వ్యవహారంతో ఓ యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పుదుచ్చేరికి చెందిన రాఘవన్(22) హైదరాబాద్లోని ఓ టైల్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం తమిళనాడులోని కుయిలాప్పాళెయం వద్ద ఉన్న కోట్టైమేట్టులో అతడు పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: రాఘవన్ స్థానికంగా ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సును ప్రేమించాడు. ఆమెతో పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన యువతి నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాఘవన్ హైదరాబాద్లో కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కంపెనీ యజమాని అతడికి చికిత్స చేయించి పుదుచ్చేరిలోని ఇంటికి పంపించాడు. Also Read: సోమవారం గ్రామ శివారులో మద్యం తాగుతున్న రాఘవన్, అతడి ఫ్రెండ్ శివనేశన్ను సంజయ్ అనే వ్యక్తి బైక్పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించి రాఘవన్ను కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి కోట్టైమేట్టుకి తీసుకెళ్లి కత్తితో విచక్షణా రహితంగా నరికి బ్రతికుండగానే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తులో ప్రియురాలి సోదరుడు, మేనమామ, ఇతర బంధువులే రాఘవన్ను కిడ్నాప్ చేసి సజీవ దహనం చేసినట్లు తేలడంతో వారందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమయ్యాడనే రాఘవన్ను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. Also Read:
By February 26, 2020 at 01:55PM
No comments