ప్రేమ పేరుతో తిరిగి పెళ్లికి మొహం చాటేసిన జవాన్.. యువతి ఆత్మహత్య

చదువుకునే సమయంలో ప్రేమ పేరుతో అమ్మాయి వెంట తిరిగి.. తీరా ఉద్యోగం వచ్చాక పెళ్లికి మొహం చాటేశాడో యువకుడు. ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక యువతి చేసుకుంది. ఈ ఘటన జిల్లా పలాస మండలంలో జరిగింది. నిందితుడిని గురువారం అరెస్ట్ చేసిన పోలీసులు కేసు వివరాలు మీడియాకు తెలిపారు. Also Read: పలాస మండలంలోని గురుదాసుపురానికి చెందిన మీనాక్షి, మందస మండలంలోని రట్టి గ్రామానికి చెందిన తులసీదాస్ ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. తులసీదాస్కు మూడేళ్ల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఉద్యోగం రావడంతో బిహార్ వెళ్లిపోయాడు. మీనాక్షి మాత్రం డిగ్రీ చదువుకుని హరిపురంలోని ప్రైవేట్ పాఠశాలలో టీచర్గీ పనిచేస్తుంది. దూరంగా ఉంటున్నా వీరిద్దరూ తరుచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమ ఊసులు చెప్పుకునేవారు. Also Read: దసరా సెలవుల నిమిత్తం ఇటీవల గ్రామానికి వచ్చిన తులసీదాస్ను పెళ్లి చేసుకోవాలని మీనాక్షి అడిగింది. అయితే తనకు భారీ మొత్తంలో కట్నం కావాలని, లేకపోతే పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. మీనాక్షి నిలదీయడంతో ఆమె సెల్ఫోన్ లాక్కుని వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 12వ తేదీన రంగోయి సమీపంలోని గ్రామదేవత దేవాలయం వద్దనున్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మీనాక్షి తండ్రి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By October 18, 2019 at 11:05AM
No comments