Breaking News

చిచ్చుపెట్టిన దసరా... పెళ్లయిన ఐదు నెలలకే మహిళ ఆత్మహత్య


కొత్త జంట కాపురంలో దసరా పండగ చిచ్చు రేపింది. పండగకు పుట్టింటికి వెళ్లే విషయంలో దంపతుల మధ్య చెలరేగిన వివాదం విషాదం నింపింది. పెళ్లయిన ఐదు నెలలకే మనస్తాపంతో భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Also Read: టంగుటూరులోని శ్రీనివాసనగర్‌కు చెందిన కుంచాల వరుణ్‌కు కందుకూరు మండలం పలుకూరుకు చెందిన మౌనిక(21)ను ఇచ్చి అయిదు నెలల కిత్రం వివాహం చేశారు. కుమార్తె, అల్లుడిని దసరా పండగకు ఇంటికి ఆహ్వానించేందుకు మౌనిక తండ్రి రెండు రోజుల క్రితం అల్లుడు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా పుట్టింటికి వెళ్లే విషయంలో మౌనిక భర్తతో గొడవపడింది. ఆదివారం భర్త బయటకు వెళ్లిన సమయంలో మౌనిక గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. Also Read: కాసేపటి తర్వాత ఇంటి నుంచి వచ్చిన వరుణ్ భార్య ఫ్యాన్‌కు వేలాడటాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. దీంతో ఎస్సై రమణయ్య సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By October 07, 2019 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/prakasam-woman-commits-suicide-due-to-disputes-with-husband/articleshow/71472572.cms

No comments