Breaking News

భద్రత కుదింపుపై పిటిషన్ విచారణ.. నేడు హైకోర్టు కీలక వాదనలు


కొత్త ప్రభుత్వం తన భద్రతను కుదించిందని పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. జస్టిస్ యు దుర్గాప్రసాదరావు ధర్మాసనం ముందు కేంద్ర తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్‌ వాదనలు వినిపించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ద్వారా మాజీ సీఎం చంద్రబాబుకు కల్పిస్తున్న మొబైల్ భద్రతలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంకొకరిని కేటాయించే అంశంపై వివరాలు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ సమయం కోరడంతో విచారణ గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... క్లోజ్డ్‌ ప్రొటక్షన్‌ టీమ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం మూడు షిఫ్టుల్లో ఒక్కో షిఫ్ట్‌కు ఐదుగురు చొప్పున సిబ్బందితో భద్రత కల్పించాల్సి ఉండగా కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే ఇస్తున్నారని, జామర్‌ కూడా ఇవ్వలేదని కోర్టుకు. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్‌ కలుగజేసుకుంటూ చంద్రబాబు భద్రతపై తాము పునఃసమీక్ష చేయలేదన్నారు. ఎల్లో బుక్‌ ప్రకారం కల్పించాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇస్తున్నామన్నారు. జామర్‌ను ఇచ్చామని ఏజీ చెప్పారు. జులై 10న తొలి విచారణ సందర్భంగా.. బహిరంగ కోర్టులో భద్రతలాంటి సున్నిత అంశాలను చర్చించడం మంచిది కాదని, ఇన్‌కెమెరాలో విచారణ జరిపితే బాగుంటుందని ఏజీ అభిప్రాయపడ్డారు. ఆయన వాదనలతో ధర్మాససం, పాటుగా చంద్రబాబు తరపు న్యాయవాదులు అంగీకరించారు. దీంతో విచారణ ఇన్‌కెమెరాలో జరుగుతోంది. తాను మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నానని, తనకు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిన భద్రతను పెంచాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పాత భద్రతను పునరుద్ధరించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.


By August 01, 2019 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/hearing-continue-today-on-chandrababu-security-in-ap-high-court/articleshow/70476344.cms

No comments