Breaking News

‘పాక్‌తో చర్చల ప్రస్తావన వస్తే అది పీఓకే గురించి మాత్రమే’


కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తోన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర రద్దుచేయడంతో పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారయ్యింది. భారత్ తీసుకున్న చర్యలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చకు వచ్చేలా చేసి లబ్ది పొందాలని ఆశించిన పాక్‌కు అక్కడా నిరాశే ఎదురయ్యింది. దీంతో దాయాది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదే సమయంలో అణ్వాయుధాల ప్రయోగంపై కేంద్ర రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలతో పాక్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అణ్వాయుధాల ప్రయోగంలో తమ సమన్వయం పాటిస్తున్నామని, భారత్ ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని పాకిస్థాన్ ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు, కశ్మీర్ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇదిలా ఉండగా, మరోసారి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, వారికి సహకరించడం ఆపనంత వరకూ పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తేలేదని ఆయన తేల్చిచెప్పారు. అంతేకాదు ఒకవేళ ఆ దేశంతో చర్చల ప్రస్తావన వస్తే గురించి మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. హరియాణాలోని కల్కాలో ఆదివారం నిర్వహించిన బీజేపీ జన ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్న రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాక్‌తో చర్చలకు వస్తే ఒక్క పీఓకే తప్పా మరే అంశంపై కూడా మాట్లాడబోమని కుండబద్దలుకొట్టారు. పాక్‌తో ఏ అంశం గురించి ఎందుకు చర్చించాలని రాజ్‌నాథ్ నిలదీశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దుతో పొరుగు దేశం బలహీనపడిందని, అదే వారికి ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ అంశంలో తమకు సాయం చేసి, ఆదుకోవాలని అన్ని దేశాలను పాకిస్థాన్ అర్ధిస్తోందని రాజ్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ను రద్దుచేస్తే తామేదో నేరం చేసినట్టు బెదిరింపులకు పాల్పడుతోందని, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికా సైతం భారత్‌తో కూర్చుని మాట్లాడుకోవాలని పాక్‌కు సలహా ఇచ్చిందని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదాన్ని ప్రయోగించి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని పాక్ ప్రయత్నిస్తే, మన 56 అంగుళాల చాతీ కలిగిన ప్రధాని తాము నిర్ణయాలను ఎలా తీసుకుంటామో చేసి చూపించారు.. పుల్వామా ఉగ్రదాడికి బాలాకోట్‌పై వైమానిక దాడుల నిర్వహించి ప్రతీకారం తీర్చుకున్నామని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. భారత్ తమ భూభాగంలో ఎలాంటి దాడులు చేయలేదని బాలాకోట్ ఎయిర్‌ స్ట్రయిక్స్‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చినా తాజాగా వాటిని ఆయన గుర్తుచేసుకున్నారన్నారు. బాలాకోట్ కంటే పెద్ద దాడులకే భారత్ వ్యూహరచన చేస్తోందని వ్యాఖ్యానించిన ఇమ్రాన్, తమ భూభాగంపై జరిగిన వైమానిక దాడులను అంగీకరించారని రాజ్‌నాథ్ అన్నారు.


By August 18, 2019 at 03:39PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajnath-says-asserting-that-dialogue-with-pakistan-is-not-possible-till-it-stops-abetting-terrorism/articleshow/70723802.cms

No comments