'జగన్ గారూ.. అబద్దాలు చెప్పడానికి కూడా డబ్బు తగలెయ్యాలా'

వైఎస్ జయంతి రోజు పంపిణీకి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓ పాంప్లేట్ను సర్కార్ విడుదల చేసింది. అయితే ఇందులో 4 నెలల క్రితం వరకు ఇస్తున్న రూ.వెయ్యి పింఛన్ను రూ. 2వేల250లకు పెంచుతూ క్రమంగా రూ.3వేలకు పెంపుదల అన్నారు. అయితే ఈ పాంప్లేట్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అయ్యా జగన్ గారు, అబద్ధాలకు కూడా, ఇంత డబ్బులు తగలెయ్యాలా ? జనవరి 2019 నుంచి జూన్ 2019 వరకు అంటే ఆరు నెలల పాటు 2 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? అందులో 5 నెలల పాటు @ncbn సియంగా ఉండగా ఇచ్చారన్న సంగతి మర్చిపోయారా ? ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా ?’అంటూ మండిపడ్డారు. అంటే లోకేష్ ట్వీట్ ప్రకారం.. టీడీపీ హయాంలోనే జనవరి 2019 నుంచి జూన్ 2019 వరకు.. ఆరు నెలల పాటూ రూ.2వేలు పింఛన్గా చెల్లించారని.. అయితే టీడీపీ రూ.వెయ్యి పింఛన్ మాత్రమే ఇచ్చిందని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేయడంపై మండిపడ్డారు. డబ్బు ఖర్చు చేస్తూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరి లోకేష్ ట్వీట్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
By July 08, 2019 at 11:56AM
No comments