Breaking News

ట్రంప్ అందుకే ఓడిపోతున్నారు.. అమెరికా ఎన్నికలపై బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు


అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. ప్రస్తుత అధ్యక్షుడు వెనుకంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ను ట్రంప్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని, దేశాన్ని కాపాడటంలో విఫలమయ్యారంటూ అమెరికా ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దర్బాంగాలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జేపీ నడ్డా మాట్లాడుతూ.. కరోనా వైరస్ మహమ్మారిని హ్యాండిల్ చేయడంలో విజయం సాధించారని, కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని 130 కోట్ల మంది ప్రజలను కాపాడారని అన్నారు. ‘అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు ఏమిటంటే ఆయన కోవిడ్-19ను సరిగ్గా నిర్వహించలేకపోయారు. కానీ మోదీజీ సకాలంలో నిర్ణయాలు తీసుకొని దేశాన్ని, 130 కోట్ల జనాభాను కాపాడారు’ అని నడ్డా అన్నారు. కరోనా విషయంలో ట్రంప్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారని, ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ దీనిని ప్రచారాస్త్రంగా చేసుకున్నారని నడ్డా తెలిపారు. ఇదిలా ఉండగా.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అక్రమాలు జరిగాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. తమ విజయాన్ని డెమొక్రాట్లు లాగేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక, ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయిన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. గత నెలలో కరోనా కేసులు తగ్గినా.. గడచిన రెండు రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబరు 26 తర్వాత మరోసారి కేసులు 50వేలు దాటాయి.


By November 06, 2020 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-president-jp-nadda-sensational-comments-on-trump-loses-in-us-elections/articleshow/79073086.cms

No comments