Breaking News

కడపలో ఘోరం.. తమ్ముడిని కిరాతకంగా చంపేసిన అన్న


చిరువ్యాపారాలు చేసుకుంటున్న అన్నదమ్ముల మధ్య వివాదం తమ్ముడి దారుణ హత్య దారితీసింది. తెల్లారేసరికి తమ్ముడు రక్తపు మడుగులో శవమై తేలాడు. జిల్లా రాయచోటిలో ఈ ఘటన జరిగింది. తమిళనాడు నుంచి వలసొచ్చిన సోదరులు రాజేంద్రన్ నారిముత్తు, రాజేంద్రన్ మురళి(24) పట్టణంలోని రాజుల కాలనీలో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడే చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. తెల్లారేసరికి తమ్ముడు మురళి రక్తపు మడుగులో శవమై కనిపించాడు. అన్న తోడబుట్టిన తమ్ముడిని కిరాతకంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఇద్దరూ గొడవపడి ఉండొచ్చని.. వ్యాపార లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదం హత్యకు దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read:


By November 01, 2020 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-brother-brutally-in-kadapa/articleshow/78978343.cms

No comments