మర్దన చేస్తానంటూ యువతిని గదిలోకి.. హైదరాబాద్ ఆస్పత్రిలో దారుణం

ఆస్పత్రికెళ్లిన యువతికి దారుణ అనుభవం ఎదురైంది. జండూబామ్తో మర్దన చేస్తానంటూ ఓ ఉద్యోగి నీచానికి దిగాడు. ఆమెని అసభ్యంగా తాకుతూ అత్యాచార యత్నం చేయడంతో భయపడిపోయిన యువతి పెద్దగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లో జరిగింది. కరోనా లక్షణాలతో యువతి ఆయుర్వేద ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆమెను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. జండూబామ్తో మర్దన చేస్తానంటూ శరీరాన్ని అసభ్యంగా తాకుతూ నీచానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసేందుకు యత్నించడంతో బెంబేలెత్తిపోయిన యువతి పెద్దగా కేకలు వేసింది. కామాంధుడి బారి నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసింది. ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. సదరు ఉద్యోగిపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రికి రావాలంటేనే భయపడుతున్నారని పలువురు రోగులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: Also Read:
By September 13, 2020 at 12:54PM
No comments