Breaking News

లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ రిక్రూట్‌మెంట్ కేసు.. హైదరాబాద్ డాక్టర్ అరెస్ట్


భారత్‌లో ఉగ్రవాద సంస్థ రిక్రూట్‌మెంట్‌కు సహకరించాడనే ఆరోపణలతో హైదరాబాద్‌కు చెందిన వైద్యుడిని యాంటీ టెర్రర్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. గ్లాస్గో విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాదికి సోదరుడైన డాక్టర్ సబీల్ అహ్మద్.. సౌదీలోని ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. గ్లాస్గో ఆత్మాహుతి దాడికి పాల్పడిన కఫీల్ అహ్మద్‌కు సబీల్ అహ్మద్ స్వయానా చిన్న తమ్ముడు. భారత్ నుంచి 2010లో సౌదీకి వెళ్లిన సబీల్.. అక్కడ ఫహద్ ఆస్పత్రిలో వైద్యుడిగా చేరాడు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న తరువాత అతడ్ని సౌదీ నుంచి బహిష్కరించారు. దీనికి సంబంధించి 2012లో బెంగళూరులో 25 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సబీల్ అహ్మద్‌పై లుక్ ఔట్, నాన్-బెయిల్‌బుల్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రముఖ కాలమిస్ట్, ప్రస్తుత మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాపై దాడికి కుట్రపన్నిన ఆరోపణలతో అతడిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదుచేశారు. ఇప్పటి వరకూ 17 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. 14 మందికి శిక్ష పూర్తయి విడుదలయ్యారు. 2015లో సౌదీ అరేబియా బహిష్కరించడంతో అరెస్టు చేసిన తరువాత ఈ కేసులో అహ్మద్ పాత్రను గుర్తించారు. అంతకు ముందు, ఈ కేసులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్‌లో అనుమానితుడిగా పేర్కొన్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌ కేసులో అరెస్టయిన సబీల్ బావ ఇమ్రాన్ అహ్మద్, బెంగళూరుకు చెందిన ఇంజనీర్ మహ్మద్ షాహిద్ ఫైసల్ రిక్రూట్‌మెంట్ ప్లాట్‌కు పరిచయం చేశాడని ఎన్‌ఐఏ ఆరోపించింది.


By August 31, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/doctor-accused-in-2012-lashkar-e-taiba-recruitment-case-arrested-by-nia-anti-terror-agency/articleshow/77844240.cms

No comments