Breaking News

బాలికను తల్లిని చేసి మరో పెళ్లి.. యువకుడిపై కేసు నమోదు


మైనారిటీ తీరని బాలికను పెళ్లి చేసుకోవడమే కాకుండా మూడేళ్లు కాపురం చేసి బిడ్డకు తల్లిని చేసిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు-2 పట్టణ పరిధిలోని నవాబ్‌పేట గ్రామానికి చెందిన ఓ బాలిక(17) మూడేళ్ల క్రితం అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివింది. ఆ సమయంలో స్నేహితురాలి ద్వారా వలేటివారిపాలెం మండలం సింగమనేనిపల్లెకు చెందిన బత్తిన వెంకట సురేంద్ర పరిచయమయ్యాడు. బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి నెల్లూరులో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. Also Read: మూడు నెలల తరువాత యువకుడి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు పెళ్లిని అంగీకరించి ప్రకాశం జిల్లా కందుకూరులో నివాసం ఏర్పాటుచేశారు. మొదట బిడ్డ పుట్టి చనిపోయాక రెండో కాన్పులో మరో బిడ్డ జన్మించాడు. కొన్నాళ్లకు వారి మధ్య విబేధాలు రావడంతో బాలిక అలితి అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. ఆమె ఎంత బతిమాలినా కాపురానికి రాకపోవడంతదో సురేంద్ర మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక సురేంద్ర ఇంటికి వచ్చి నిలదీసింది. దీంతో అతడు రెండో భార్యకు ఏదోవిధంగా నచ్చజెప్పి పంపిస్తామని, లేకపోతే ఇద్దరితోనూ కాపురం చేస్తానని నచ్చజెప్పాడు. Also Read: అతడి మాటలు నమ్మని బాలిక ఆదివారం కందురూరు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి న్యాయం చేయాలని కోరింది. దీంతో డీఎస్పీ సురేంద్రను పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అతడు బాలికకు ఫోన్ ఈ విషయం పోలీసులకు ఎందుకు చెప్పావంటూ బెదిరించాడు. దీంతో ఆమె సోమవారం సాయంత్రం మళ్లీ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి బాధితురాలితో పాటు డీఎస్పీతోనూ మాట్లాడారు. బాలికను మోసం చేసిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. 18 ఏళ్లు నిండని బాలికను ఆమె ఇష్టంతో పెళ్లి చేసుకున్నప్పటికీ చట్టరీత్యా నేరమని చెప్పిన డీఎస్పీ.. బాల్యవివాహం చేసుకున్న సురేంద్రతో పాటు అతడి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని సిబ్బంది దేశించారు. Also Read:


By November 26, 2019 at 09:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/nellore-man-his-parents-booked-for-child-marriage-case/articleshow/72234434.cms

No comments