రూ.25లక్షల విలువైన బంగారాన్ని అక్కడ పెట్టుకుని స్మగ్లింగ్

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం మాఫియా రెచ్చిపోతోంది. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాలో అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. కొందరైతే ప్రమాదకరంగా మర్మాంగాల్లో, మలద్వారాల్లో బంగారాన్ని దాచి రవాణా చేస్తున్నారు. తాజాగా దుబాయ్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ షేక్ తన మలద్వారంలో బంగారం పెట్టుకుని కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. ఎయిర్పోర్టులోని బాడీ స్కానర్లో బంగారం ట్యూబ్లను గుర్తించిన అధికారులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. Also Read: దుబాయ్ నుంచి వచ్చిన షేక్ 667 గ్రాముల బంగారాన్ని మలద్వారంలో పెట్టుకుని వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. దీని విలువ సుమారు రూ.25లక్షల వరకు ఉంటుందన్నారు. బంగారాన్ని పేస్టు్లా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా కడుపులో పెట్టుకున్నాడని, అతడిపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడిందని అధికారులు తెలిపారు. నిందితుడి తొలుత తనిఖీ చేయగా ఎలాంటి వస్తువులు దొరకలేదు. అతడి బాడీ స్కానింగ్ చేయగా కడుపులో నాలుగు ట్యూబ్లు కనిపించాయి. దీంతో అతడికి ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. అందులో పెద్దమొత్తంలో బంగారం పొడిరూపంలో ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్యూబ్ను ప్రమాదకరంగా మలద్వారం ద్వారా కడుపులోకి పంపించారని, ఇలాంటి చర్యల వల్ల ప్రాణాల మీదకు వస్తుందని పోలీసులు చెబుతున్నారు. Also Read: Also Read:
By November 01, 2019 at 12:38PM
No comments