11ఏళ్ల బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారయత్నం

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి కన్న కూతురిలాంటి విద్యార్థినిపైనే అత్యాచారానికి యత్నించిన ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలోని కిషన్బాగ్ అసద్బాబానగర్లో ఇంతిజార్ అలీ అనే వ్యక్తి మోషియన్ పేరుతో ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక (11) అదే స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. Also Read: బాలికది పేద కుటుంబం కావడంతో ఆమె తల్లిదండ్రులు సకాలంతో ఫీజు చెల్లించలేకపోయారు. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ బాలికను పరీక్షలకు అనుమతించనని చెప్పాడు. బాలికను పరీక్షకు అనుమతించాలని తల్లిదండ్రులు కోరడంతో ఆధార్ కార్డు, ఇతర పత్రాలు తీసుకొస్తే పరీక్ష రాయిస్తానంటూ చెప్పాడు. దీంతో బుధవారం తల్లిదండ్రులు బాలికను తీసుకొని పాఠశాలకు వచ్చారు. Also Read: స్కూల్లో కంప్యూటర్ పని చేయడం లేదని బాలిక తల్లిదండ్రులను ఇంటికి పంపిన ప్రిన్సిపాల్ బాలికను తన ఛాంబర్లోనే ఉంచుకున్నాడు. సాయంత్రం ఆధార్ కార్డును పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాలిక కంగారుపడి అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు వెంటనే బాలికను బహుదూర్పురా పీఎస్కు తీసుకెళ్లి ప్రిన్సిపాల్పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ ఇంతిజార్ అలీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. Also Read:
By November 01, 2019 at 11:55AM
No comments