Breaking News

పనిమనిషి కూతురిని గర్భవతిని చేసిన కీచకుడు.. నల్గొండలో దారుణం


జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పనిచేస్తున్న దంపతుల కూతురిపై కన్నేసిన కీచకుడు ఆమెను గర్భవతిని అమానుష ఘటన చోటుచేసుకుంది. నిడమానూరు మండలం శాఖాపురంలో ఈ ఘటన జరిగింది. మండలానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఇంట్లో పనిచేస్తున్న దంపతులకు కూతురు(13) ఉంది. ఆ ప్రజా ప్రతినిధి వద్దే డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏర్పుల రమేష్ పనిమనిషి కూతురిపై కన్నేశాడు. బాలికను బెదిరించి ఆరునెలలుగా పలుమార్లు అత్యాచారం చేస్తున్నాడు. కొద్దిరోజులుగా బాలిక ఆరోగ్యం బాగోకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకి దిగ్భ్రాంతికర నిజం తెలిసింది. కూతురు గర్భంతో ఉందని తెలియడంతో గుండెబద్దలైంది. నెమ్మదిగా ఆరా తీయగా డ్రైవర్ రమేష్ బెదిరించి అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read:


By November 04, 2020 at 12:34PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/13-year-old-girl-raped-impregnated-in-nalgonda-district/articleshow/79036689.cms

No comments