Breaking News

కెమికల్ గోదాంలో పేలుడు.. 12 మంది మృతి


గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లో ఓ రసాయనాల గోదాములో జరిగిన భారీ అగ్నిప్రమాదం పలువురు ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 9 మంది గాయపడ్డారు. పారిశ్రామికవాడ పిరానా-పిప్లాజ్‌ రోడ్డులోని గోదాములో ఈ దుర్ఘటన జరిగింది. గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . దీంతో పేలుళ్లు కూడా సంభవించాయి. ప్రమాదం ధాటికి గోదాం పైకప్పు కుప్పకూలింది. చుట్టుపక్కల వాళ్లు గోదాంలో భారీ పేలుళ్లు జరిగాయిన చెబుతున్నారు. మొత్తం ఆరు సార్లు గట్టిగా పేలిన శబ్ధాలు వచ్చాయని తెలిపారు. పేలుళ్లకు భయంతో పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 26 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు అధికారులు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. 9 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. Read More: శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని పోలీసులు రక్షించారు. గాయపడ్డవారిని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించారు. గోదాంలో కొన్ని అనుమానాస్పద రసాయనాలు నిలవు చేసి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వాటి వల్లే పేలుడు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


By November 05, 2020 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/blast-at-chemical-factory-12-dead-at-ahmadabad-gujarat/articleshow/79053856.cms

No comments