Breaking News

ట్విట్టర్‌లో ఓ వీడియోకు స్పందన.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా


సామాజిక మాధ్యమాల్లో తన దృష్టికి వచ్చే వీడియోలు, ఫోటోలకు స్పందించడమే కాదు... కష్టాల్లో ఉన్నవారి పట్ల ఉదారత చూపే వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఒడిశాలో ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న వాగును దాటేందుకు నిత్యం కష్టపడుతున్న ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలకు పడవలు అందజేయడానికి ముందుకొచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి వాగు దాటడానికి చేస్తున్న ప్రయత్నాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది దృష్టికి వచ్చింది. దీంతో వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. మల్కాన్‌గిరి జిల్లా రాణిగుడ పంచాయతీ పరిధిలోని సౌలిపలి, నేరుడి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రంలో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. సరైన రవాణా సౌకర్యాలేని ఆ గ్రామాన్ని చేరుకోవాలంటే కొండల్లో కిలోమీటరు దూరం నడిచి, ఓ వాగును దాటాలి. వర్షాకాలంలో ఈ వాగు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తుంటుంది. , ఇతర వస్తువులు నడుముకు కట్టుకొని వాగును దాటి ఈ ఇద్దరు మహిళలు విధులను నిర్వర్తిస్తున్నారు. గత పదేళ్లుగా ఈ ఇద్దరు మహిళలు ఇదే విధంగా గ్రామానికి చేరుకుంటున్నారు. మహిళలు వాగు దాటుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు హేమలత శిసా, పరిమళ పనేల్‌‌లు గత పదేళ్లుగా వాగుదాటడానికి నడుముకు ఎండిపోయిన గుమ్మడికాయలు, ఖాళీ కుండలను చుట్టుకుని వాగు దాటుతుంటారు.


By October 23, 2020 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/business-man-anand-mahindra-offers-boat-to-odisha-anganwadi-workers-in-malkangiri/articleshow/78819937.cms

No comments